10, జూన్ 2013, సోమవారం

ఆంద్రజ్యొతి లొ సురవరం సుధాకర్ రెడ్డి రాసిన వ్యాసంపై సమిక్ష

ఈ వ్యాసం జున్ 6న సురవరం సుధాకర్ రెడ్డి  చండ్ర రాజేస్వరావు శతజయంతి పురస్కరించుకుని ఆంద్రజ్యొతిలొ రాసిన వ్యాసానికి సమాదానంగా.
   దాన్ని చర్చించే ముందు తెలంగాణా సాయుధ రైతాంగ పొరాటం గురించి క్లుప్తంగా చెప్పుకుందాం.
    1946 నుండి 1951 చివరి వరకూ పూర్తిగా 5 సంవత్సరాలు తెలంగాణా సాయుధ ప్రతిఘటన గాధ విస్తరించింది.1948 సెప్టంబర్లొ భరత ప్రభుత్వం నైజాం సంస్తానంపై పొలీసు చర్య జరిపి ప్రతెక్ష అధికాం సంపాధించి జొక్యం కల్గిల్చుకునేదాకా ఆప్రతిఘటన అప్రతిహంగా సాగింది. కేంద్రం నుండి భరత ప్రభుత్వం సైన్యాలను పంపి తెలంగాణా ప్రజలకు విముక్తి కల్గిస్తున్నట్లుఇ ప్రకటించింది కాని వారు వాస్తవానికి వారు విముక్తి కల్గించింది వీర తెలాంగాణా రైతాంగానికి కాదు.-పారాన్న బక్కులైన భుస్వాములకూ వారి తాబేదార్లుకు.  పొరాడుతున్న రైతాంగంపై కసి తీర్చుకున్నారు. దాద్దాపు 50వేల మంది సైనికులు నిరాయుధులైన తెలంగాణా రైతు కులీలపై ప్రయొగించాలు. వారి ఆద్వరయంలొవున్న భుమిని భలవంతంగా లాకున్నారు. 4 వేలమంది రైతాంగం ఆహుతి అయ్యారు. లక్ష మంది స్త్రీ పురుషులు జైలళ్ళలొనూ భయటా చిత్రహింసలు అనుభవించారు. స్త్రీలు సామూహిక అత్యాచారం చేశారు. పురుషులను కళలొ కుడా ఊహించని విధంగా మల ముత్రాలు పొసి , భండ్లకు కట్టి ఈడ్చి సంపేరు. తలల్లొ మేకులు దిగపొడిచారు. బర్త ఎదుటే బర్యనూ, కుతుళ్ళనూ చెరిశారు. స్త్రీలను దిఘంభరంగా వేలాడతీశారు. వారి రొమ్ములు కొశారు. ఒక్క మాటలొ చెప్పాలంటే 50 వేల మంది సైన్యాలతొ ఫపిస్టు పాలన సాఘించారు నెహ్రూ సైన్యం.

1947 నుండి -48 వరకు కాస్మీర్ వివాదం పై పాకిస్తాంతొ జరిగిన యుద్దంలొ కర్చు పెట్టిన దానికన్నా ఎక్కువే పెట్టేరు తెలంగాణా రైతాంఘన్ని అణసటానికి.
   తెలంగాణా రైతాంగం నైజాం నవాబు పాపిస్టు పాలన నుంచి రైతాంగం సాధించుకున్న విజయాలు; వెట్టిచాకిరీ రద్దు, నిర్భంద దాన్యం చేకరణ లెవీ రద్దు. తరతరాలనుంచి అప్పు ఉన్నారంటూ వాళ్ళను బానిచలుగా చేసుకొవడం లేదా భుములు లాక్కొవడం నుంచి. దాదాపు 10 లక్షల యకరాలు ఆ పొరాటం సాయుద రైతాంగం సాధించుకుంది. 

  ఆసాదించుకున్న భుమిని తిరిగి భుస్వములకు అప్పగించడానికి నెహ్రూ సైన్యం రంగప్రవేశం చేసింది.  చండ్ర రాజేస్వరావు , రావి నారాయణ రెడ్డి .డి.వి.దేశపాండె లాంటి తిరొగమన మితనాద కమ్యునిస్టులు ఎమంటారంటె హైదరాబాదులొ నెహ్రు సైన్యం ప్రవేచించి మీదటే సాయుద రైతాంగం సాధించుకున్న విజయాలను ఎలాంటి ప్రతిఘటనా లేకుండా వాళ్ళకు వొప్పచెప్పి వుడాల్సిందని . చండ్ర రాజేస్వరావు "చారిత్రక తెలంగాణా పొరాటం" రావి నారాయణ రెడ్డి రాసిన "తెలంగాణా నగ్నసత్యాలు"  శత్రువు కుడా రాయలేని విషం కక్కెరు ఇద్దరూ.  మాకినేని బసవపున్నయ్య గారి మాటల్లొ చెప్పాలంటె.  1950-52 సంవత్సరాలలొ మితవాద కమ్యునిస్టు పార్టి ఏ తెలంగాణా పొరాటాన్ని దళారుల దౌజ్యన్యలాండయనీ, వ్యక్తిగత హిసావాదమనీ, రాజకీయ దుంకుడు చర్యనీ, దుమ్మెట్టి పొసిందొ ఆ పాఋతియే 1971 సంవత్సరాలలొ సాయుద రైతాంగ పొరాట రజొత్సవాన్ని అట్టహాస ప్రకటనతొ పుస్తకాలూ, వ్యాసాలు రాసి పంచుతుంది ఇందులొ చాలా వక్రబాస్యాలు,దివాళాకొరు రాజకీయవైకురులనూ ఆకాశానికెత్తి పొగడ్తులతొ ముంచెత్తుతుంది. "

1950-52 నాటి తీవ్ర విబేదాలు తెలంగాణా రైతాంగ పొరాటాన్ని 1948 తర్వాత కొనసాగించటం తప్పా? ఒప్పా? అన్న కీలక సమస్యకే పరిమితమైలేవు ఆ ముక్యబాగాన్ని కేంద్రంగా చేసుకుని అనేక విప్లవ విద్రొహ చర్యలూ, సుత్రాలూ నిర్మాణాలూ, నిర్మాణ పద్దతులూ ప్రవేశపెట్టెరు. నేటి మన రివిజినిస్టుగా నాటి తెలంగాణా పొరాటం పైనే ద్వజమెత్తిన కమ్యునిస్టు పెద్దలు.కాల క్రమేణా వారితొ కరచాలణం చేసి వారికే ప్రముఖనాయకుడయ్యరు కామేడ్ రాజేస్వరావు నేడు.
1. హైదరాబాదు సంస్తానంలొ కాంగ్రెస్ ప్రబుత్వ సైన్యాలు ప్రయేసించడం ప్రదాన ఉద్దేశం పొరాటాన్ని దాని ప్రతిఘటన విజయాలనూ దెబ్బతీయడమే ప్రదాన ఉద్దేసమని సుందరయ్య, బసవపున్నయ్య వాదనైతె.  కాదు నిజాం నిరంకుశ పాలనను కులదొచి సంస్తాన ప్రజలను విముక్తులం చేయడమే ప్రభుత్వ సైన్య ప్రదమ లక్ష్యమని రాజేస్వరావు, నారాయణ రెడ్డి మున్నగు వాదన.
తెలంగాణా పొరాటంలొ ప్రాణాలు అర్పించిన అమర వీరులకు జొహార్లు అర్పిదామంటున్నాడు రాజేస్వ్రావు.వేలాది మందిని హత్యచేయడానికీ,లక్షమంది స్త్రీ, పురుషులను హింసింసడానికీ, కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అబ్యుదయ సర్ఫికెట్ తగిలించి దానితొ చేయీ చేయీ కలిపి జాతీయ ప్రజాస్వామ్యానికీ, శొషలిజానికీ, బాటలు వేయాలని శలవిస్తున్నాడు.

    శాంతియుత సహజీవనం, శాంతియుత ఆర్దికపొటీ, శాంతియుత శొషలిస్టు విప్లవ పరిఒణామం, అందులొ ఒక భాగంగానే  బుర్జువా వర్గంతొ యేకమై పెట్టుబడీదారియేతర పంతాద్వారా శాంతియుత శొషలిస్టు పంతా చేరడం, వగైరా మితవాద పిడివాదాన్ని చేపట్టేరు చండ్ర రాజేస్వర్ రావు ప్రబుతులు.  ఇక సురవరం సుధాకర్ రెడ్డి వ్యాసానికొద్దాం.
" హైదరాబాదు విలీనం తర్వాత సాయుదపొరాటాన్ని బలపరిచిన ప్రజాతంత్ర శక్తులూ, సాదారణ ప్రజలూ, సాయుద పొరాటపు అవసరంపై సంతౄప్తి చెందలేదు గ్రామాలనుంచి అడవిలొకి వెళ్ళంచిన అనిర్వార్య పరిస్తితి.ప్రజల మద్దతు క్షీనించింది".   ఈ పాచిపొయిన పాటను చండ్ర రాజేస్వర్ రావు , రావి నారాయణ రెడ్డి పాడగా పాడగా అరిగిపొయిన పాటను ఈ యన కొత్తగా ఎత్తుకున్నాడు. పొరాటంలొ ప్రజల సహకారం లేకపొతే నెహ్రూ నైన్యాలతొ 3 సంవత్సరాలు ఎలాపొరాడింది?. ఈ ఆత్మ గొష ఎమిటంటె రైతాంగం సాధించుకున్న భుములను తిరిగి భూస్వాములకు ఇవ్వలేదని.   బుర్జువా పార్టీలకూ సి. పి.ఐ పార్టికీ తేడా అంటూ ఎమీలేదు. ఇప్పుడైతే సి.పి.యం. కుడా లేదు.

  తెలకపల్లి రవి కుడా జున్ 6 న ఒక వ్యసం రాశాడు." ఇన్ని అవరొదాల ద్వరా సుంధరయ్య, రాజేస్వర్ రావు వంటి నాయకులూ ఆదర్శాలకు అంకితమై అశేష కార్యకర్తలుండం ద్వారా అరుణ పతాకం ఎగురుతునే వుంది"   ఈ తెలకపల్లి రవి సుందరయ్యనూ, రాజేస్వర్ రావునూ ఒకగాటన కట్టెడు.ఇద్దరి ఆదర్శాలూ ఒకటే అయినట్టు!!. ఇద్దరి ఆదర్శాలూ సిద్దాంతాలు వేరు అలాంటప్పుడు ఒకే గాటన ఎలాకట్టేరు రవి గారూ? ఈ గొర్రె తొలు కప్పుకున్న తొడేలుకు ఒక విక్షణ అంటూ వుండదు . అడ్డదిడ్డంగా పొతుంది బుర్జువా నాయకులనూ కమ్యునిస్టు నాయకులనూ కలి అందరికీ ఒకే ఆదర్శాలంటుంది. కొడి అన్ని దిబ్బల్లొ కెలికినట్టు అన్ని చానళ్ళూ తిరుగుతూ వుంటాడు. 


11, ఏప్రిల్ 2013, గురువారం

శ్రీకాంత్ మీకు సమాదానం చెప్పడం జరిగింది.

 శ్రీకాంత్ మీ బ్లాగు మొత్తాన్ని గమనించినత్లయితె కమ్యునిజం పైన రాసిన టపాలన్నీ కేవలం విమర్శ తప్ప విషయం లేదు. మీరు పాడిన పాచిపొయిన పాటలు 1867 నుంచీ వున్నాయి కాకపొతె మీ పాటలు మరీ పేలవంగ వున్నాయి వాటిల్లొ సైయీ ,సారం లేదు.   సిద్దాంతపరమైన చర్చ అసలే లేదు. అక్కడా ఇక్కడా ఏరుకున్న పైపైన చెత్తను వేరుకుని అదే విమర్శ అని అపొహాలొ వున్నారు. ఇంతకన్నా ఘటుగా సిద్దాంత చర్చలొకి కొంతవాకు దిగి మాయమైన వాళ్ళు వున్నారు.వాటిల్తొ పొల్చుకుంటె మీది లెక్కలొకి రాదు.  మార్కిజం గురించి మీరు తెలుసుకున్నదంత విశెఖర్ గారు మార్కిజం గురించి ఆయన బ్లాగులొ అక్కడక్కడ తడిమారు.దాన్ని పట్టుకునే మీరు ఎంతచేపటికీ వేలాడుతున్నారు. అదే మీకు తెలిసిన మర్కిజం.బావిలొ వున్న కప్ప ఇదే ప్రపంచం అనుకుంటుంది . అదేవిధంగా శెఖర్ గారి బ్లాగే మీకు మార్కిజంగా కనపడుతుంది.  మార్కిజాన్ని విమర్శిస్తూ ఇన్ని టపాలు రాసినారు కదా యక్కడైనా సిద్దాంతపరమైన చర్చలొకి దిగి ఇది అశాస్త్రీయంగా వుందని గాని లేక పలాన దగ్గర ఇలా వుందని కొడ్ చేస్తూ అది ఎవిధంగా తప్పొ నిరూపించడం ఇంతవరకు చేయలేదు. మార్కిజం గురించి ఓన మాలు కుడా తెలియకుండా  విమర్శ చేయడం  కొత్తతేమీ కాదు. గతంలొ చలం గారి గురించి  యవరొ పేపర్లొ విమర్శగా రాస్తె దాన్ని పట్టుకుని వెకటేస్వర్ రావు. అనే ఆయన యేకంగ పుస్తకమే రాశారు.ఆయన రచనలు ఎమీ చుడకుండానే!!. ఇలాంటి వెంకటేస్వర్ రావులు వేలకు వేలు వున్నారు.  మర్కిజం గురించి ఎమీ తెలియకుండానే ఇంతటి కక్ష, ద్వెషం, ఎందుకు పెంచున్నారొ ఆయానకే తెలియలి. ఇక ఆయన లేవనెత్తి ఇలాంటి ప్రశ్నెలకు గతంలొ నేను   జవాబు చెప్పివున్నాను.  హుతుబద్దం, లేదా తార్కికంగా   నిలబ్బడం గాని ఆయనకు తెలియదు.నేచెప్పిందే నెగ్గాలి అనే పంతం అడుడడుగునా కనిపిస్తుంది.ఇక ఆయన లేవనెత్తిన ప్రశ్నెలకు జవాబు చెపుతాను.

     1 మార్కిస్టులు మతం మత్తుమందులాంటిదని అంటూ వుంటారు దానికి కారణమేమిటి?
 కార్మిక వర్గం నిత్యం అనేక సమస్యలలొ కొట్టుమిట్టాడుతూ వుంటుంది. తమకష్టాలకు  పుర్వజన్మ పాప పున్యాలు కారణమని లేక ఆ కష్టాలను దేవుడే గడెక్కిస్తాడని తాత్కాలికంగానైనా మనస్సును శాంతింపచేసుసుకుంటారు. అసలు కారణం తెలియక. అందుకే మతం మత్తుమందులాంటిదని అంటారు.
2.అనేక కారణాల వల్ల మార్కిజం కుడా మతంలా మత్తుమందులంటిదవదా? మార్కిజంలొ కుడా మతము లాగానే అనే అపొహాలు వున్నాయి.చాలా అన ర్దాలకు కారణం అయ్యింది కదా?
నేను ముందుగానే చెప్పినట్టు విమర్శ వుంటుంది కాని విషయం వుండదు. అనేక కారణాలు వుంటె ఒక్క కారణమైన చెప్పి యాడవచ్చు కదా? ఆహా దాని జొలికి పొడు పొవడానికి విషయం వుంటే కదా.

3. మార్కిస్టు పాలనలొ అనేక మానవహక్కుల ఉల్లంగన జరిగింది స్టాలిను, మావొలు వలన ఎన్నొ కొట్లమంది చనిపొయినారు. ప్రజాస్వమ్యంలొ అయితె చట్టబద్దంగా పొరాడే అవకాశం వుంటుంది. కమ్యునిస్టుదేశాలలొ ఆ అవశశం లేదు. ఇది ఆయన ఇండొ పేరాలొని సారాశం.

 కమ్యునిజవైపుగా రష్యా , చైనాలొ కొన్ని అడుగులు వేశాయి తర్వాత తిరొగమనం పట్టాయని చెవిలొ జొరీగ లాగ ఎన్ని సార్లు చెప్పినా అదే ప్రశ్నె మల్లి అడుగుతారు ఇక స్టాలిన్ గురించి చెప్పాలంటె అతన్ని ఆపదవికి అర్హుడు కాదని లెనిన్ చివరిదశలొ చెప్పినాడు.కాని ఆ లెఖను బయటకు రాకుండా చేసి స్టాలిన్ అధికారంలొకి వచ్చినాడు. అతను చనిపొయేవరకు అది బయటకు రాలేదు.తర్వాత అతని వ్యతిరేక వర్గం  దాన్ని బయటపెట్టింది. అంటె వాళ్ళు ఉత్తములనికాదు కేవలం అధికారం కొసం బయట పెట్టినారు. ఇక మావొ గురించి అయితే వ్యక్తిగత పుజలు చేయించుకున్నాడు ఇలాంటి తప్పిదాలు తప్ప మారణహొమం అంటూ ఎమీ చేయలేదు. ఒక బుర్జువ పార్టీ లొకి కమ్యునిస్టులు చొరబడలేరు.కాని ఒక కమ్యునిస్టు పార్టీలొకి బుర్జువాలు చొరబడగలరు. ఎందుకంటె అది ఇంకా ప్రరంభదశలొనే వుంది కనుక. విరుద్ద ప్రయొజనాలు వున్నాప్పుడు దేని బలాబలాలను బట్టి దాని వర్గ ప్రబల్యం వుంటుంది.

4.మతాలన్నీ మంచే చెపితే దాన్ని అనుసరించె మనుషులు చెడుచేయడం తర్కించవలసిన విషయం.మనుషులనుండి వేరుగా వున్నట్లయితె మతమైనా మరేదైనా వౄదా కాదా.ఇది శెఖర్ గారి కొడ్ దీన్ని మార్కిజానికి అన్వయించి అడిగారు శ్రీకాంత్.

దీన్ని నేను శెఖర్ గారి బ్లాగులొనే ప్రశ్నించాను దీని పైన ఇంకా ఆయన సమాదానం ఇవ్వలేదు. మతాలన్నీ మంచే చెపుతాయి  అందులొ ఎమీ సందేహం లేదు. కాని అందులొ ఏది మంచి ఏది చెడు అనేది వర్గ దౄష్టితొ పరిశీలించినప్పుడు మాత్రమే అవగతమౌతాయి. అందరికీ సహాయపడాలని మతం చెపుతుంది.కాని ఒకరు సహాయం చేసే స్తితిలొ ఎందుకున్నారు ఇంకొకరు చేయించుకొనే స్తితిలొ ఎందుకున్నారు లాంటివాటికి ఎం జవాబు చెపుతుండంటె పుర్వజన్మ ఫలం , లేదా కర్మ పాప ఫలాలు  కారణాలుగా చెపుతుంది. మరి ఆజన్మలొ ఎందుకున్నారు దానికన్నా ముందుజన్మగా కారణం చెపుతారు మరి ఆజన్మలొ ఇక దీనికి అంతం లేదు. అలాగే పరులసొమ్ము పాము వంటిది ఇది ఒక నీతి వాఖ్యం ఇందులొ తప్పుపట్టాల్సినదేమీ లేదు.మరి ఒకరు దొంగతనం చేయాల్సిన స్తితిలొ ఎందుకున్నారు.? ఇదే మతానికి సంఘానికి వున్న వైరుద్యం. బౌతిక పరిస్తితులు ఒకలా వుంటె మనిషి ఇంకొలా ప్రవర్తించలేడు. నీతి ఒకలా వుంది దానికి విరుద్దమైన బౌతికపరిస్తితులు ఇంకొలా వున్నాయి. ఇక మార్కిజం 100 కి 99 మందికి తెలియదు దాన్ని ఆచరించడమనేది తర్వాత.

5. మర్కిజం పుస్తకాలలొ పగటికలకు కనడనికి బౌశత్తు నాశనం చేసుకొవడానికిచేసుకొవడనికి ఈ మార్కిజం దేనికి ఉపయొగపడుతుంది.

బంగారు కొండ శ్రీకాంత్  చరిత్రను ఎప్పుడైనా గమనించావమ్మా. పొరాటాలు గాని లేక విప్లవాలు గాని లేకుండా వుంటే సమాజం ఇంకా బానిసస్తితిలొనే వుండేది. నీవు ఒకడికి అమ్ముడుపొయి నీ బిడ్డలు ఇంకొకడికి అమ్ముడుపొయి.  చెట్టుకొకరు పుట్టకొకరు విడిపొయి నిరంతరమైన శ్రమ వాడికి కొపం వచ్చినప్పుడు నిన్ను చంపివేయవచ్చు. కుడా ఆస్తితిలొ నిన్ను నీవు ఒక సారి ఊహించుకొ.మార్కిజం పగటికలొ లేక బౌతికశక్తితొ అర్దమౌతుంది. మర్క్స్ పెట్టుబడి తన ఇష్టా ఇష్టాలతొ రాయలేదు.గనితమంత ఖచ్చితత్వంతొ కౌలు, వడ్డి, లాభం లాంటి పేర్లతొ కార్మికుడి శ్రమ ఎలా దొపిడీ అవుతుందొ శాస్త్రీయంగా నిరూపించినాడు. ఈనాటికీ అంటె 1867 లొ పెట్టుబడి ద్వార బయట పడిన తర్వాత కుడా బుర్జువా అర్ద శాస్త్రానికి విలువంటే ఎమిటొ తెలియదు. తెలిసినా విద్యార్దులకు చెప్పరు.వాళ్ళ కన్ను వాళ్ళే పొడుచుకొలేరు కదా.

6.మార్కిజం నిరంకుశ దొరణులకూ, మానవహక్కుల ఉల్లంగనకూ, ఒక రూపాన్ని కల్పించడం జరిగిందనీ అనేకమంది మంది చరిత్రకారులూ, మేదావులూ చెప్పారు కదా ? మరి వాటివిషయేం చేస్తారు.

నేను ఇంతకు ముందే చెప్పినాను విమర్శ వుంటుంది కాని విషయం వుండదు. యవరా చరిత్రకారులూ, మేదవులూ, కొంచమన్నా వివరణ ఇవ్వవచ్చు కదా? సరే అలా చెప్పారే అనుకుందాం పరస్పర విరుద్ద ప్రయొజనాలు ఉన్నప్పుడు లేదా పరస్పర శత్రు వర్గాలు వున్నప్పుడు ఎమైనా మాట్లాడతారు. ఇంగితం వున్నవాళ్ళు రెండింటిని పరిశీలించి అది మానవ హక్కులను ఎమి ఉల్లంగించిందొ ఎలా ఉల్లంగించిందొ చెప్పాలి. మానవుడు అంటె మిగత జంతుజాలం నుంచి వేరు చేయడాని మానవుడని చెప్పవచ్చు. రొండు వర్గాలుగా వున్నప్పుడు మనవుడంటె ఎ మానవుడని వేల కొట్లు వున్నవాడు  మానవుడే అడుక్కుతినేవాడూ, మానవుడే. సందేహం లేకుండ చెప్పవచ్చు ఆ చరిత్రకారులూ,ఆ మేదావులూ, శ్రీకాంత్ లాంటి వారేనని.

  తీవ్రవాదానికి మతమే కారణం అని యవరూ చెప్పలేదు.అన్ని మత మనుషులూ కొంతమంది తీవ్రవాదాన్ని సాగిస్తున్నారని చెప్పినారు.

7. మార్కిజమే గొప్పదని నమ్మిన సమాజాలు మార్కిజపు సిద్దాంతాన్ని నమ్మిన మనుషులు చేసే దౄష్ట చర్యలను మార్కిజం ఆపలేకపొఇంది కద? మరి మార్కిజం వౄదా కాదా ? దేనికి పనికివస్తుంది మార్కిజం ? ఆచరించని నీతులు తెగ చెప్పుకుని ఏమి లాభం మార్కిజానికి అసలు అస్తిత్వమే లేదని దీన్ని పట్టి అర్దమవ్వడం లేదా ? మానవ హక్కుల వుల్లంగనకూ, వామపక్ష తీవ్రవాదానికీ,కమ్యునిస్టు సాగించి నరమేదానికీ మార్కిజం ఒక frame work లాగా ఉపయొగపడుతొది కదా?

  మార్కిజ గొప్పదని నమ్మిన సమాజలంటె మీ అర్దం రష్యా, చైనా, లే కదా? ఎదైనా పదార్తానికి గాని లేదా  ఒక వస్తువుకుగాని, లేదా   ఒక జీవికి గాని ఆయా దర్మాలు  , లేక గుణాలు వుంటేనే    ఆయా వస్తువులుగ లేదా జీవులుగా పరిగనింపబడతాయి.  నేను ఇంతలు ముందే చెప్పినాను అవి తిరొగన దేశాలని.అంటె పక్కా పెట్టుబడిదారీ దేశాలని.మార్కిజం దేనికి పనికి వస్తుందొ నీఒక పెట్టుబడిదారుడవైవుంటె నీపైన తిరుగుబాటు చెసినప్పుడు ఆ తిరుగుబాటు చేసిన కర్మిక వర్గనికి తెలుస్తుంది మార్కిజం దేనికి పనికివస్తుందొ.లేదా నీవు కార్మిక వర్గానికి చెందినవాడవైతె (మేదా శ్రమ చేచేవాళ్ళు కుడా కర్మిక వర్గం కిందికే వస్తారు)  నీ వర్గం బానిసత్వం అర్దం కాని మూర్కుడికిందకు వస్తావు. నీతులు చెప్పడనికి అదేమీ మతం కాదు. శాస్త్రీయమైన సిద్దాంతం.కార్మిక వర్గం ఎందుకు పొరాడాలొ పట్టపగలంత స్పష్టంగా శాస్త్రీయంగా వాళ్ళ బాదలకు కన్నీళ్ళుకు గల కారణాలను వివరించింది , మీలంటి పెటీ బుర్జువాకు (అంటె అటు పెట్టుబడిదారీ వర్గం కాదు ఇటు కార్మిక వర్గం కదు. మద్యరకం వ్యాపరులన్న మాట.) ఎన్నటికీ అర్దం కాదు. దానికి అస్తిత్వం  వుందొ లేదొ తలకిందులుగా కాకుండా సరీగా నిలబడు .వెన్నుముఖ వుందా? కళ్ళుతెరిచి చూడు కనపడకపొతె కంటి డాక్టరు దగ్గరకు వెళ్ళు ఒక పక్క పంచబక్షపరమాన్నాలు మరొపక్క తాగడానికి గంజికుడా లేదు. ఒక పక్క ఆకాశమంత భవంతులూ, మరొపక్క గుడిచైనా లేని నిర్బాగ్యులు. భుమండలంలొని భూమి, ఘనులూ, ప్యాక్టరీలూ, సమస్త వనరులూ కొద్దిమంది చేతులలొ పొగుపడి వున్నాయి.అదంతా కార్మికుల శ్రమ  అది కర్మికుల శ్రమ ఎలా అవుతుందొ "పెట్టుబడి" పుస్తకాన్ని చదువు తెలుస్తుంది విలువ అంటె ఎమిటొ శ్రమ అంటె ఎమిటొ లాబాలకు,  వడ్డీలకు   గల కారణాన్ని పట్టుకుని చరిత్రలొ మొదటి సారిగ పేద, ధనిక గల కారణాలను శాస్త్రీయంగా  వివరించాడు.

  చివరిగా ఒక మాట  ఇదంతా నేను శ్రీకాంత్  కొసం రాయలేదు. అతని తత్వం నాకు బాగా తెలుసు. ఈ గొడంతా ఎందుకంటె యవరైనా మార్కిజంపైన అపొహాలు వుంటె వాళ్ళైనా కళ్ళు తెరుస్తారని చిన్న ఆశ.
 

13, నవంబర్ 2012, మంగళవారం

విమర్శ ఎలా వుండాలి

సామాజిక జీవితరూపాలగురించిన మనిషి ఆలొచనలూ, తత్ఫలితంగా ఆ రూపాలకూ, సంభంధించిన అతని శాస్త్రీయ విశ్లెషణా, వాటి వాస్తవ చారిత్రాభివౄద్దికి వ్యతిరేక దిశలొ వుంటాయి. సంఘటనలు జరిగిన తర్వాత అతను ఆలొచించటం ప్రారంభిస్తాడు.అనగా చారిత్రక అభివౄద్ది పక్రియ అతని ముందు వుంచిన ఫలితాలతొ అతను ప్రారంభిస్తాడు. మనిషి మొదట తెలుసుకొవడానికి ప్రయత్నించేది వాటి చారిత్రక స్వబావాన్ని కాదు కేవలం వాటి అర్దాన్ని మాత్రమే. అతని   దౄ ష్టిలొ యీ గుణాలు యెప్పుడూ మారకుండా శాశ్వితంగా వుండేవి కనుక. వాటి చారిత్రక స్వబావాన్ని పరిశీలించడానికి అతను ప్రయత్నించడు.

 కొంతమంది ఏ సంఘటన జరిగినా పెట్టుబడిదారీ సమాజాన్ని నిందిస్తారని వ్యక్తి చేసిన పని పెట్టుబడిదారీ సమాజం ఎలా కారణం అని ప్రశ్నిస్తారు. నిగ్రొ అంటే ఎవరు ఒకానొక నిర్దిష్ట సమాజంలొని బానిస తూనిక రాయి బరువుకు కొలమానంగా వుంది చారిత్రకంగా అభివౄద్ది చెందిన ఒక నిర్దిష్ట సమాజంలొ మాత్రమే బరువుకు కొలమానంగా వుంది అంతేగాని దాని సహజ గుణం బరువుకు కొలమానం కాదు. ఆయా నిర్దిష్ట సమాజాలననుసరించి మనిషి వ్యవహరిస్తాడు అతని చైతన్యం సమాజ స్తాయినిమించి వుండదు.  సమాజంలొని ఏవిషయాన్ని తీసుకున్నా దాని అంతర్గత సంభందాలు పునాదిలొ వుంటాయి. ఉదాహరణకు కుటుంబాన్ని తీసుకుంటె ఒకరు పొషించేవారుగానూ, మరియొకరు పొషించబడేవారుగానూ, వున్నారు.వాళ్ళ మద్య సంభంధం అసమానంగా వుంది.ఒకరు లొబడేవారుగానూ, ఒకరు యజమానిగానూ వున్నారు.ఫలితంగా పురుషుడికి ప్రత్యెక అధికారాలు వచ్చాయి అతను ఎలాంటి తిరుగుళ్ళైనా తిరగవచ్చు అదేపని స్త్రీ చేస్తె కఠిన దండనకు గురౌతుంది. సమస్య ఎన్ని వుంటె అన్ని రూపాలలొ దర్శనమిస్తుంది. వీటికి పరిస్కార మార్గాలుగా ప్రెమతొ మార్చుకొవాలని సహనం వహించాలని రకరకాలుగా చెప్తారు. అంతేగాని ఆ సమస్యకు పునాది అయిన ఆర్దిక సంభందాన్ని ప్రశ్నించరు.ఎందుకంటే అది సమస్యను సూటిగా వ్యక్తం చేయదు. అంటే అది ఆర్దిక సమస్యగా కనిపించదు. దొంగ తిరుగుడిగా వ్యక్తం చేస్తుంది.పై పై సమస్యలకే పరిమితమైతే సమస్య ఎప్పటికీ సమస్యగానే వుంటుంది.

 మార్కిజం పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ఒక బ్లాగరు ఏమంటున్నాడొ  చూ డండి.
"నా టపాలలొ సిద్దాంతపరమైన చర్చ చాలా తక్కువ ఎందుకంటె నేను రాసేవి రియాక్టివ్ పొస్టులు అంటే అవతలివారు చేసే ఆరొపనలను తప్పు అని నిరూపించే పొస్టులు. "
"ఇక మార్కిజం గురించి విశేఖర్ ఒక్కటే నాకు మార్కిజంలా కనపడుతునన్నావు అర్దం లేని మాట. ప్రస్తుతం బ్లాగుల్లొ మార్కిజం గురించి రాస్తున్న ప్రతివారూ చెప్పిన దాని గురించీ నేను రాయడం జరిగింది. "
"ఒకరు దొంగతనం చేసే స్తితిలొ ఎందుకున్నారనికదూ, నీ ప్రశ్నె సింపుల్ అతనికి అవసరమైన ధనం అతని వద్ద లేని కారణంగా అలా లేక పొవడానికి కారణం అతనికి సరైన పని లభించకపొవడం చాలాసార్లు అతను పని చేయడానికి నిరాకరించే సొమరి అవ్వడం ఈజీ మనికి అలవాటు పడటం "
"అతను(కార్మికుడు)చేసే పనికి తనకి రావలసినది తాను తీసుకుంటున్నాడు."
"బిల్గేట్స్ లాంటిలాంటి వారూ టాటాలూ, బిల్లాలూ, అంబానీలూ,ప్ర తి ,పారిశామిక వెత్తా మేదశ్రమ చేసే శ్రామికులే కడా?"
"భుములూ, సంపదా అంతా కొద్దిమందిచేతిలొ వుంటే నష్టం ఎమిటి?"
"పనికి తగ్గ ప్రతిఫలం దొరుకుతున్నంత వరకూ సంపద యవరి దగ్గరున్నా నష్టం ఎమీ లేదు.ఆ విధంగా దొరికే విధంగా పెట్టుబడిదారీ విదానం చుస్తుంది , న్యాయస్తానాలు వున్నాయి. " ఇలాంటి ప్రవచనాలు చాలా వున్నాయి.

  యవరైనా ఒక విషయాన్ని విమర్శించదలుచుకున్నాప్పుడు దాని మూలం ఎంచెపుతుందొ తెలుసుకుని అది ఎలా తప్పొ లేదా ఎవిధంగా అశాస్త్రీయమొ నిరూపించవలసిన బాద్యత విమర్శకుడిపైన వుంటుంది.ఇది యక్కడైనా జరిగేదే కాని మన బ్లాగరు ఏమంటున్నాడంటే బ్లాగర్లు రాసేదానిపైన మాత్రమే ఆదారపడుతున్నాను అంటున్నాడు.దాని పర్యవసానాలు యలావుంటాయంటే  నేను ఒక విషయాన్ని విమర్శిస్తున్నప్పుడు ఆవిషయం లేదా ఆఘటన అంతర్గత సంభందాల ద్వారా బాహ్యరూపం ధరించిన దౄగ్గొచరం మాత్రమే మీకు కనపడుతుంది. కార్మికుణ్ణి పెట్టుబడిదారుడు దొచుకుంటున్నాడు అన్నప్పుడు.ఎలా దొచుకుంటున్నాడనే అంతర్గత విషయాలను నేను చెప్పడం లేదు.ఆ విషయాన్ని నేను చెప్పదలిస్తె ఆ మూలాన్ని తిరిగి ఇక్కడ రాయల్సి వుంటుంది అది సాద్యం కాదు.వందల పేజీలు వుంటుంది. ఇప్పుడు మళ్ళీ మన విమర్శకుడి దగ్గరకు వస్తె దొచుకుంటున్నడనే విషయన్ని లొకాభిప్రాయం ప్రాకారం విమర్శిస్తాడు. పైన చెప్పిన విధంగా కర్మికుణ్ణి పెట్టుబడి దారుడు దొచడం లేదు తాను చేసిన పనికి పూర్తి ప్రతిఫలం పొందుతున్నాడు.ఒక విషయాన్ని లొకాభిప్రాయం ప్రకారం చెపితే అదే లొకాభిప్రాయం నాకు తెలియదా?  మన మనస్సుల నుండి సైస్ తీసేస్తె మన కంటికి కనపడే దాన్నే సత్యాలుగా బ్రమిస్తాం. భుమి బల్లపరుపుగా వుంది భుమే విశ్వానికి కేంద్రం భుమి చుట్టు సుర్యుడు తిరుగు తున్నాడు. కార్మికుడు చేసిన పనికి పూర్తి ప్రతిఫలం పొందుతున్నాడు. లాభాలు అమ్మే, కొనే వాళ్ళదగ్గరనుంచి వస్తాయి. వందల వేల కొట్లు వాళ్ళ శ్రమ ఫలితం.కాంతి మనకంటికి తెల్లగా కనిపిస్తుంది నిజానికది వివిధ వర్ణాల కలయిక. దౄగ్గొచరం ద్వారానే అంతస్సారాన్ని గుర్తించగలిగినట్లయితే వివిధ విఙ్ఞాన శాస్తాల అవసరం వుండేది కాదు.అంతర్గత సారమే దౄగ్గొచరం. అంతస్సారం దౄగ్గొచరాన్ని పూర్తిగా ఆవరించి వుండదు దౄగ్గొచరం అంతస్సారపు యించు మించు వ్యక్తీకరణ మాత్రమే. అంతస్సారం వస్తువ లొపల వుంటుంది బయట వుండేది కాదు.దౄగ్గొచరం మాటున అది దాగి వుంటుంది.పార్లమెంటరీ ప్రజాస్వమ్యపు అంతస్సారం బుర్జువా వర్గం నియంతౄత్వమే కాని అది ప్రజలందరీ అభిష్టానుసారం నడిచే ప్రభుత్వ వ్యవస్తగా కనపడుతుంది. కార్మిక వర్గ నియంతౄత్వం అనగానే అది ఒక నియంతౄవ వ్యవస్త అని స్ఫరిపిస్తుందిగానీ  దాని అంతస్సారం నిజమైన పీడిత ప్రజల ప్రజాస్వామ్యం.

      మార్కిజ పైన విషం కక్కే ప్రతి చెత్తమాటకూ జవాబులు ఇచ్చుకుంటూపొలేం.
"ఉత్పత్తి సంబందాల మొత్తమేసమాజపు ఆర్దిక నిర్మాణ చట్రం; దాని నిజమైన పునాది మీదే చట్ట బద్ద రాజకీయ ఉపరి నిర్మాణం లేస్తుంది. సామాజిక చైతన్యానికి సంభంధించిన  నిర్దిష్ట రూపాలు దానికి తగిన విధంగానే వుంటాయి. బౌతిక జీవితానికి సంభంధించిన ఉత్పత్తి విదానమే మొత్తం మీద సామాజిక , రాజకీయ, బౌద్దిక జీవిత క్రమాన్ని నిర్దేశిస్తుంది. మానవుల అస్తిత్వాన్ని నిర్దేశించేది వారి చైతన్యం కాదు. దానికి బిన్నంగా వారి సామాజిక అస్తిత్వమే వారి చైతన్యాన్ని నిర్దేశిస్తుంది." మార్క్స్ 

18, జులై 2012, బుధవారం

వ్యక్తిత్వ వికాస పుస్తకాలూ --దాని తీరు తెన్నలు.


    వ్యక్తిత్వ వికాస పుస్తకం మొడట చదివింది ఏడేళ్ళ క్రితం యండమూరి గారి విజయానికి ఐదుమెట్లు ఆతర్వాత నాదౄక్పదం మారింది. ఈమద్య యక్కడ చుసినా t v ల లొనూ  అదే చర్చ పట్టాబి రాం గారు యండమూరి వీరేంద్రనాద్ లాంటి వాళ్ళు.  వాళ్ళే కాకుండా పుస్తక షాపుల్లొ "మీరు కొటీస్వర్లు కావడం ఎలా?" "మీ విజయం మీ చేతుల్లొ వుంది"   "డబ్బు సంపాదించడం ఎలా?" ఇలాంటి పుస్తకాలు డజన్ల కొద్దీ వున్నాయి.  ఈ మద్య డా: b v  పట్టభిరాం గారి "ఒక్కడు" పుస్తకం చదివాను దానిగురించి రాయాలంటే ఒక పుస్తకమే రాయవచ్చు.నేను కొన్నింటినే ప్రస్తావిస్తాను.


     సమాజంలొ ఒకపక్క పేదలూ, ఒకపక్క ధనికులూ, విడిపొయి పరస్పర శత్రువర్గాలుగా విడిపొయి వేల సంవత్సరాలక్రితమే జరిగిపొఇంది . ఆయా నిర్దిష్ట  సమాజంలొ బానిస, బానిసయజమానిగానూ, ప్యుడల్ దాసుడూ, ప్యుడల్ ప్రభువుగానూ , పెట్టుబడిదారుడూ,కార్మికుడుగానూ వుంటూవచ్చినారు . ఆస్తి ఒక నిర్దిష్ట వర్గానికి ఎప్పుడూ సమస్యగానే వుంటూ వచ్చింది. సమాజంలొ వున్న సమస్త భుములూ, ఘనులూ ఉత్పత్తి సాదనానూ, ఒక వర్గం చేతిలొ పొగుపడి వున్నాయి . దాన్ని బద్దలు కొట్టందే అవి కార్మిక వర్గానికి అందే మార్గం లేదు. సమాజమంటూ  ఒకటుంది దాన్ని విడిచి వ్యక్తిగత ఆదర్శాలూ, వ్యక్తిగత లక్ష్యాలూ ఏర్పరుచుకుంటే నీకు త్వరలొనే అర్దమౌతుంది నీ ఆర్దిక స్తితిగతులు వెనక్కునెట్టబడతాయి.

 వ్యక్తిత్వ వికాస నిపుణులు చెట్లనే తప్ప అడవిని చుడలేరు.పులిని చుసి ఒక వ్యక్తి బయపడితే ఆ బయానికి కారణం నీ మెదడులొవున్న ప్రత్యెక రసాయణం తప్ప బౌతికంగా వున్న ఆ పులి కారణం కాదంటారు వీళ్ళు. అలాగే ధనిక , పేద , తేడాలకుగల సమాజపు పునాదిని ఏమాత్రం పట్టించుకొరు. నీవు పేదవాడిగా వున్నావంటె నీవే కారణం నీ వ్యక్తిగత ఆ దర్శాలూ, లక్ష్యాలూ, లేవు కనుక అలా వున్నావంటారు.

 పట్టాబిరాం గారి పుస్తకాన్ని మూడు బాగాలుగా  విభజించుకొవచ్చు. 1. వ్యక్తిగత లక్ష్యాలూ, ఆదర్శాలూ పెట్టుకొవడం.2. కొంతమంది విజయం సాధించిన వారి జీవిత కథలను పదే పదే చెప్పడం. 3. నీతివాక్యాలు బొధించడం.
ఒకడు శిఖరాగ్రం చెరుకున్నాడంటె దానర్దమేమిటి ? అది ఎలాజరుగుతుంది? ఒకడు లక్షల కొట్లకు ఆస్తిపరుడైయ్యాడంటె  ఎలా అయ్యాడు? ఆ లాబాలు యలా వస్తున్నాయి? వడ్డీ అంటే ఎమిటి ? ఈ విషయాలన్ని ఈ కొతల రాయళ్ళకు పట్టవు. శిఖరాగ్రానికి వెళ్ళమని ఊకదంపుడు తప్ప. ఒకడు శిఖరాగ్రాన వున్నాడంటే వాడి కింద వేలమందిని శ్రమదొపిడీ చేస్తేనే వాడు శిఖరం పైన వుండగలడు. అందరూ శిఖరం పైకి వెళ్ళగలరా? అప్పుడు వాడికి శ్రమ చెసేవాడు యవడుంటాడు. చరిత్రను ఒకసారి గమనిస్తె అట్టడుగు వర్గానికి చెందిన వారు పైకి వెళ్ళిన వాళ్ళు కొట్లమందిలొ కేవలం వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. సమాజ వనరులన్నీ కొందరి చెతులలొ పొగుపడి వున్నాప్పుడు అందరూ శిఖరానికి చేరుకొవడం సాద్యం కాదు. ఊహాలొకంలొ విహరించడం మాత్రం కాయం.



        నీతి వాక్యాలు వల్లించడం : అసలు నీతి అంటే ఎమిటి ? అవినీతి అంటే ఎమిటి ? అవి ఎందుకున్నాయి?  నీతి అనేది ఆయా నిర్దిష్ట సమాజాలలొ మారుతూ వస్తుంది అది గడ్డకట్టి అన్ని సమాజాలకూ, ఒకే సుత్రం పనికి రాదు. బానిస సమాజంలొ బానిసకు ఏ హక్కులూ వుండవు ఆఖరికి అతన్ని చంపే హక్కు కుడా యజమానికుంది.అది బానిస సమాజంలొ నీతిగా చెలామని అయింది. అలాగే ప్యుడల్ , పెట్టుబడిదారీ సమాజాలలొ మారుతూ వస్తుంది. బాల్య వివాహాలూ , సతీసహగమనం, స్త్రీలను హింసించడం నేడు నేరం.
"లక్ష్యం  నిర్వర్తించుకొవాలంటె  తమ వైకరి , బలాబలాలు తెలుసుకొవాలి"
దీనర్తం ఎమిటంతే తమ విద్యా, ఆర్దిక స్తితిగతులనుపట్టి పొవాలని ఒకరు చెప్పినా చెప్పక పొయినా జరిగేది అదే . ఉత్పాదక పరిశ్రమ పెట్టాలనుకునే వారు  లేదా వ్యాపారం పెట్టదలుసుకున్నావారు గాని తమ ఆర్దిక స్తితిగతులను బేరీజు వేసుకునే చేస్తారు. ఒక పేదవ్యక్తి తమ కుమారుణ్ణి కార్పొరేట్ స్కూల్ లొ చెర్పించలేడు.ప్రబుత్వ బడికి పంపుతాడు.

పట్టాభిరాం గారు అర్దం ఆస్తికుడూ, అర్దం నాస్తికుడూ. జ్వొతిష్యం, ఉంగరాలు, మంత్రాలు, లాంటివి నమ్మవద్దంటాడు. నమ్మకాల్లొకి అతి పెద్దమూడనమ్మకమైన "దేవుడికి" కి సాష్టాంగ పడినాడు. ఇది అడుగడుగునా కనిపిస్తుంది. అమెరికాలొ ఇద్దరు పైకి వచ్చిన వాళ్ళగురించి చెప్తూ,ఒక గొప్ప గాయకుడి వీర్యాన్ని అక్కడి వనితలు అలాంటి కొడుకు కావాలని కుత్రిమంగా గర్బదారణ చేయించుకున్నారని చెప్పారు. మార్లిన్ మన్రొ అనే మరొ మొడల్ ఒక తొట్టె నిండా వైన్ నింపి దానిలొ స్తానం చేసిన తర్వాత ఆ వైన్ ని ఒక గ్లాసు అప్పటి ధరకు 100 రెట్లు అధిక ధరతొ అమ్మారని చాలా  ఉత్సాహంగా ఏ విమర్శా లేకుండా చెప్పారు ఎందుకంటె వాళ్ళు శికరానికి చేరుకున్నారు కదా!. " నేను సాధించగలను అని 21 సార్లు రాస్తె విజం సాదిస్తారు."
ఇకనేం 21 సార్లు రాసి కొటీస్వర్లు కాండి!.
" ఈ ప్రపంచంలొ ధనవంతుడిగా యవరూ జన్మించరు పేదవాడిగానూ జన్మించరు"
పట్టభిరాం గారికి ఎదొ అయినట్టు వుంది కనీసమైన వాస్తవాలు కుడా పరగణలొకి తీసుకొవడం లేదు.ధనవంతుడి పిల్లలు ధనవంతులుకాక ఇంకేమౌతారు? వాడి ఆస్తి ఆ పిల్లలకేరాసిస్తాడు కదా .పేదవాడి పిల్లలు పేదతనం తొనే బతుకుతారు. ఇలాంటి పుస్తకాలు చదవటం వలన తాత్కాలికమైన మనస్శాంతి అనేది కలుగుతుంది   అందులొ ఎమీసందేహం లేదు.  ఎప్పుడొ ఒకప్పుడు మనం  కుడా గొప్పవాళ్ళమైపొతామని ఒకరకమైన తెలియని సంతొషం కలుగుతుంది. మరొకాయన వుండాడు ఆయనే యండమూరి వీరేంద్రనాద్ ఈయనకు మరొ పేరు మంత్రాల రచయిత ఆయన నవల తులసిదళం లొ చేతబడిని బహుచక్కగా వర్నించారు. గతంలొ ఈ యనవల్ల ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది ఈయన వ్యక్తిత్వ వికాస నిపుణుడి అవతారం ఎత్తినాడు ఈయన మాట్లాడితే మీరు కారు కొనడంకొసం గొల్ పెట్టుకొండి ఇది తప్ప వేరేమాట రాదు. ఈయనకు పేదలంటే పరమ చీదర  ABN TV  చానల్లొ విత్ RK పొగ్రాం, చుడండి.


 పట్టభిరాం గారు. స్వాతంత్రం గురించి, రాజకీయాల గురించి రాసినారు. వాటి గురించి మరొసారి చర్చించుకుందాం. నా చిన్నప్పుడు  2వ తరగతిలొ అనుకుంటా బేష్ అనే పాటం వుండింది దానిలొ పొద్దునమనమూ లేవాలి పళ్ళూ బగాతొమాలి గ్లాసుడు పాలూ తాగాలి ఉతికినబట్టలు కట్టాలి ఇలా సాగుతుంది అది దానికి ఏమాత్రం తీసిపొకుండా కొన్నింటిని పాటించమని  .పొద్దున నడవటం , మంచిసంగీతం వినటం, గొరువెచ్చని నీటితొ స్తానం మొలకెత్తిన గింజలను తినడం ఇవి మద్య తరగతి మాత్రమే పాటించేటివి .ఈ వ్యక్తిత్వ నిపుణులు చెప్పేది ఎంతవరకు తీసుకొవచ్చునంటె ఇతరులపట్ల మన ప్రవర్తన పైన చెప్పిన కొన్ని అలవాట్లు .శిఖరాలు లక్ష్యాలు లాంటివి ఊహాలొకంలొ విహరించడమే.

19, జూన్ 2012, మంగళవారం

తెలకపల్లి రవి గారూ ఇది మీకే.

 తెలకపల్లి రవి గారూ.
    రంగనాయకమ్మ గారు బుద్దుడిని తన ఇష్టా ఇష్టాలతొ  విమర్శించారా లేక అంబెద్కర్ చెప్పిన దాని ప్రాకారం విమర్శించారా? అసలు బుద్దుడి ఎందుకు విమర్శించల్సివచ్చింది ? సామాజిక సమస్యలకు అంబెద్కర్ బుద్దుడిని మార్గంగా చుపారు. ఫలితంగా బుద్దుడిని కుడా విమర్శించవలసి వచ్చింది. మీరన్నట్టు బుద్దుడి భావజాలాన్ని విమర్శించలేదు.  అంబెద్కర్  వ్యాఖ్యలేవో రంగనాయకమ్మ  వ్యాఖ్యలేవో మీకు అర్దం కాకపొవచ్చు మీలాగ అందరికీ అర్దంకావని అనుకొవాలా? ఆమె శైలి గురించి మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఆమె పాఠకులకు తెలుసు.


   అంబెద్కర్ ను ఆమె ఎంతగా విమర్శించారొ అంతగా ఆయన చేసిన కౄషి గురించి పుస్తకం పొడవునా చెప్పేరు. అలాగే ఆయన మార్కిజానికి అణగారిన వర్గాను దూరం చేసినందుకు కఠినంగా దుయ్యపట్టెరు. మీలాగా కట్టె విరగాకూడదు పామూ చావాకూడదు అనే  పద్దతిలొ కాకుండా . చాలామంది సంస్కర్తలకు  మార్కిజం గురించి తెలియకుండా అశాస్త్రీయంగా రాసినా అది సహజం కాని అంబెద్కర్ మార్కిజం ఏంచెపుతుందొ తలకు యక్కకుండా దానికి వీపుతిప్పి ప్రతిదాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ఫలితంగా ఈనాడు అణగారిన వర్గాలు మార్కిజానికి దూరం అయినారు.



   అంబేద్కర్ ఏనాడొ రాసినవి కాదు వేలు వందల సంవత్సరాలు కాలేదు ఈమద్య రాసినవే అదీ మార్స్కిజాన్ని విమర్శిస్తూ.అలాంటి వ్యెక్తిని ఏ చారిత్రక పరిస్తితిని   దృష్టిలో పెట్టుకుని విమర్శించాలి.? మార్కిజం గురించి తెలియని వారూ ఆయన పేరు వినని వారూ అశాస్త్రీయంగా రాయడం సహజమే అలాంటి సహజ అంశాలు అంబేద్కర్ లొ వున్నాయా?

   సమాజం గాని ప్రకౄతి గాని నిరంతరం  చలనంలొ వుంటాయనే విషయం  మీరు చెపితేగాని రంగనాయకమ్మకు తెలియదా? చలం సాహిత్యం గురించి మీలాంటి కమ్యునిస్టులు ఆయన అశాస్త్రీయంగా రాశారని ఇష్టం  వచ్చిన కూతలు కూస్తుంటే విమర్శ అనేది యలావుండాలొ ఆయా చారిత్రక పరిస్తితులు దృష్టిలో పెట్టుకొని ఏలా విమర్శ చేయాలొ మార్క్స్, లెనిన్ చెప్పినవి ఆదారం చేసుకొని సమగ్రంగా వివరించారు.

  అంబేద్కర్ ప్రభావంలొ వున్నవాళ్ళను నొప్పి తగలకుండా వెన్న పూసినట్టు వుండాలన్న మాట. ఏది హేతుబద్దంగా వుంది ఏది తర్కంగా వుంది అనేదానితొ సంభందం లేకుండా . ఇక్కడ ప్రధానంగా తీసుకున్నది అంబేద్కర్నే .కొశాంబి ని గాని శర్మను గాని కాదు. వాళ్ళు రాసింది ప్రస్తావించడానికి. అంబేద్కర్ కులాల పుట్టుపుర్వొత్తరాలు కనుక్కొవడాని మతాలనేకాక జంద్యంలొ ఎన్ని పొగులు వుంటాయి లాంటి వాటి పైన సమయానంతా వెచ్చించాడు దీన్ని ఆమె గొడ్డుచాకిరీతొ పొల్చారు అదీ కొపంతొ కాదు
అలాంటి తెలకపల్లి రవి గారికి ఆసక్తి కరంగానూ చర్చించ తగినివిగానూ తొస్తున్నాయి.


  రిజర్వేషన్ అనేవి తాత్కాలిక పరిస్కారాలు మాత్రమే అవే శాస్విత పరిస్కారాలుగా భావించ కూడదు. దీని ద్వి ముఖాలు వున్నాయి ఒక అర్దంలొ రిజర్వేషన్ అనేది మంచిదే కాని దాన్నే శాస్విత పరిస్కారంగా భావిస్తె అది భానిసత్వమే దీన్నే  ఆమె చెప్పేరు అది రవి గారికి పొంతన లేని తనంగా కనపడుతుంది.  ఆమె ఏమి చెప్పినా తిరస్కరించాలనే దృష్టి తొ వున్నారు. అందుకే ఆమె చప్పనివి చెప్పినవి మీకు అనుకూలమైనవి వేరుకుని మరీ విమర్శిస్తున్నారు.అందుకు నిదర్శనం మీరు రాసిన అపసవ్య వ్యాఖ్యలు. ఆమేదొ కులాల వారిని సంఘాల వారిని కలుపుకొని పొవద్దన్నట్టుగా విమర్శించారు. ఆమె బుద్దుడిని ఎందుకు విమర్శించారొ పరిగణలొకి తీసుకొకుండా ఆమె 2500 సంవత్సరాల భావజాలాన్ని విమర్సించినట్టుగా మీకు అనుకూలంగా రాసుకున్నారు. దాన్ని విమర్శించిన నేను ఆమె బక్తుడిగా జమకట్టెరు. దీన్ని బట్టి మీకు అనుకూలంగా రాసి వాళ్ళు మీకు బక్తులన్న మాట.

 రంగనాయకమ్మ గారు అన్నట్టు గురువు గాని నాయకుడు గాని భొధించిన విషయాల్లొ సరైన దాన్ని తీసుకుని సరికానిదాని తిరస్కరించాలి తప్పుల్ని ఒప్పుల్ని ఒకే విధంగా భరించ కూడదు  ప్రేమ అయినా బక్తి అయినా విచక్షణా రహితంగా వుండకూడదు.

 కమ్యునిస్టు ముసుగులొ వుండి మార్కిజానికి ద్రొహం చెయ్యడం ఇదేమీ తెలకపల్లి రవిగారితొ మొదలవ్వలేదు. ఒక్కమాటలొ చెప్పాలంటే రవి గారు గొర్రెతొలు కప్పుకున్న తొడేలు వంటి వారు.

8, జూన్ 2012, శుక్రవారం

తెలకపల్లి రవిగారి విమర్శకు ప్రతి విమర్శ

  కులాలూ,మతాలూ, లాంటి వాటికి స్వంత అస్తిత్వం వుండదు సమాజంలొ వున్న ఆర్దిక అసమానతలను అంటిపెట్టుకుని జీవించే పరాన్న జీవులు. కులాల సమస్య పరిస్కారాలను చుసిస్తూ అంబేద్కర్ అనేక పుస్తకాలు రాశారు కులాల,సమస్యలకుగాని,ఆర్దిక సమస్యలకుగాని మార్కిజం పనికిరాదనికుడా శలవిచ్చారు. దానిపైనే చర్చిస్తూ రంగనాయకమ్మ గారు "దళితసమస్య పరిస్కారానికి బుద్దుడు చాలడూ, అంబేద్కర్ చాలడూ, మార్క్స్ కావాలి" అనే పుస్తకం రాశారు .

   దానిపైనా,మరియూ, ఈమద్య ఆంద్రజ్యొతిలొ రాసిన అస్తవ్యెస్త సంస్కర్తలూ, అనే వ్యాసం రాశారు. ఈరొండిటిపైనా విమర్శగా తెలకపల్లి రవి గారు విమర్శగా "అపసవ్య వ్యాఖ్యతలు"  అనే వ్యాసం రాశారు దానికి సమాధానంగా రాస్తున్నాను.
 
    సుందరయ్యను కమ్యునిస్టు గాందిగా అనేక దాశాబ్దాలుగా చేస్తున్నదే కనుక దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదని అంటున్నారు. రవి గారు. ఈయన గతంలొనూ జ్యొతిష్యం అనేకమంది నమ్ముతున్నారు కనుక తప్పుపట్టాల్సిన పనిలేదని అన్నారు. ఈయన ప్రకారం అనేకమంది ఏంచేసినా తప్పులేదు. కాకపొతె ఆసేసెదాంట్లొ అనేకమంది వుండాలి అప్పుడు తప్పుపట్టాల్సి పనిలేదు. ఈయన కొత్తగా కనిపెట్టిన సిద్దాంతం ఇది. ఈయన ప్రకారం అనేకమంది అనుకునే సామాజిక విషయాలలొ సైన్సు ప్రమేయం వుండకూడదు ఎందుకంటే అనేకమంది అనుకుంటున్నారు కాబట్టి.

   '"వేరు వేరు కాలాల భావజాలకు సంభంధించిన  వ్యెక్తులను పొల్చి వాధించడమే  అశాస్త్రీయం"
   రంగనాయకమ్మ గారు వేరు వేరు కాలాలకు సంభంధించి వ్యెక్తులను విమర్శించడం తన ఇష్టా ఇష్టాలతొ చేయలేదు. అంబేద్కర్ సామాజిక సమస్యలకు బుద్దుడు దర్మాన్ని పరిస్కారంగా చుసించాడు.మార్కిజం పనికిరాదని ఒకపేరాలొ అంతలొనే మార్క్స్ చెప్పినాటివన్ని బుద్దుడు చెప్పేడని ఒక పేరాలొ ఇలా పొంతన లేకుండా చెప్పెడు. కనుకనే బుద్దుడిని విమర్శించవలసి వచ్చింది. ఈవిషయాన్ని వదిలేసి తెలకపల్లి రవిగారు వేరు వేరు కాలాలకు భావజాలాన్ని విమర్శించడ అశాస్త్రీయం అని తన ఇస్టమొచ్చిన భాష్యాలు చెపుతున్నాడు. 

  అస్తిత్వ వాదాన్ని యవరూ వ్యెతిరేకించలేదు వేరు వేరు సంగాల వారిని కలుపుకొనిపొవద్దని యవరూ అనడంలేదు.ప్రదాన సమస్యను వదిలి సెకండరీ సమస్యపైన ఎంత పొరాడినా వుపయొగం వుండదు. ఆవిషయాన్నే ఆమె విమర్శించారు తెలకపల్లి లాంటి కులగజ్జి నాయకులు అర్దం చేసుకొవడం లేదు. లెనిన్ ని ప్రమానికంగా తీసుకొలేదని మీరెలాచెప్పగలరు.?

 సుందరయ్య వర్దంతి సభలకు బురువాలు కుడా వస్తున్నారంతే దానర్దమేమిటి ? రొండు వైరుద్యాల మద్య ఘర్షణ లేకుండా ఐఖ్యం ఐనారంటె రొండూ ఒకటయ్యాయని అర్దం పేరుకు మాత్రమే కమ్యునిస్టులు సిద్దాంతపరంగానూ, భావజాలపరంగానూ, ఈరొండిటిమద్య ఏమాత్రం తేడా లేదు. మార్కిజాన్ని ఏదేశానికి తగినట్టు ఆదేశం అన్వయించుకొవడంటే ఎలా అన్వయించుకొవాలి ఏవిషయంలొ అన్వయించుకొవాలి? మార్కిజమంతా శ్రమదొపిడీపైన ఆదారపడివుంది . ఇక దాన్ని వదిలేసి బుర్జువా సంస్కరణలకు పరిమితమౌవ్వాలి. ఇప్పుడు చేస్తున్నది అదే.  మార్కిజం ఆశయ సాదనకొసం అహొరాత్రులూ కౄషిచేస్తున్నారంట !! cpm పార్టీ 30యెళ్ళపాటు అదికారంలొవుండి ఏంచేసింది.?  పేదల భూములను పారిశ్రామికవెత్తలకు పంచిపెట్టింది దాన్ని అడ్డుకున్న పేదలను cpm గూండాలతొ కాల్పులు జరిపించింది.

  ఇక చివరిగా తెలకపల్లి రవిగారి గురించి చెప్పుకుందాం. T.V.  లలొ సినిమా పొగ్రాములకు యాంకర్లు ఆయా బ్యనర్లనుబట్టి ఆయా హీరొలను పొగుడుతూ వుంటారు. ఈయనను రాజకీయ విశ్లేషకుడుగా ఆయా వార్తా చానళ్ళు  పిలుస్తూ వుంటారు. ఆయా చానళ్ళకు తగినట్టు గానే మాట్లాడుతూ వుంటారు. ఈయన కమ్యునిస్టు అట!!.

4, జూన్ 2012, సోమవారం

పురాతన సమాజం

 చరిత్రను బౌతికవాద దౄక్పదం తొ పరిశీలించే పద్దతిని అప్పటికి 40 యేళ్ళ క్రితమే  మార్క్స్ కనుగొన్నాడు . దానినే తన సొంత పద్దతిలొ అమెరికాలొ "మొర్గాన్"మళ్ళి కనుగొన్నాడు . 

  సమాజ పరిణామ క్రమాన్ని అత్యంత నిశితంగా సవివరంగా శాస్రీయంగా పరిశీలన చేసిన గ్రంధమే పురాతన సమాజం . డార్విన్  సిద్దాంతం ఎంతటి అపురూపమైనదొ మార్క్స్ అదనపు విలువను కనిపెట్టడం ఎంతటి అసాదారణ విషయమొ అంతటి  అంతటి మహత్తరమైన గ్రంధమని ఎంగెల్స్ చెప్పెడు. ఒక వాక్యంలొ చెప్పలంటే ఈ విస్వమొక కుటుంభం మనపుర్వికులంతా ఒకరే మానవులంతా ఒకటే .

 కల్పనలు, అన్వ్యెషణలు ద్వారా మానవుడు అట్టడుగు నుంచి ఎలా క్రమ వికాసం చెందినది వెల్లడించాడు ఆయన ఒక్క రొజులొనొ లేక ఒక నెల లొనొ రాయలేదు. దాదాపు 40 యేళ్ళ పాటు అమెరికాలొని రెడ్ ఇండియన్లలొ వుండి  అక్కడి తెగలలొ దత్తత తీసుకొబడి తన అన్వెషణ ప్రరంభించాడు
  ఈ నాటికీ మన పాఠ్య పుస్తకాలలొ చరిత్రగతిలొ కుటుంభపడ్డతిలొ మార్పుపెమీ లేదన్నట్టుగా  ఈనాటి బుర్జువా కుటుభం పైదాని ప్రతిభింభమే అనుకుంటున్నారు మహా అయితె ఆదిమ కాలంలొ వావి వరసలు లేకుండా స్రీ , పురుషులు కలుస్తుండేవారని వప్పుకునేవారు.
   ఈ పుస్తకాన్ని ఈ మద్యనే విశాలాంద్ర వారు ముపై యేళ్ళ తర్వాత మళ్ళి అందుబాటులొకి తెచ్చారు.